Tuesday, December 21, 2010

మన్మోహన్‌ పీడ కల

మన్మోహన్‌కి ఒక కల వచ్చిందంట. ఆయన కోర్టులో ఉన్నడంట. బోనులో కూర్చున్నడంట. చేతులకు బేడీలు ఉన్నయంట. బాడీ మీద గీతల చొక్కా ఉందంట. ఆయన పక్కనే సరిగ్గా అట్లనే ఇంకొడున్నడంట. కళ్లు నలిపి చూస్తే, అప్పుడు కనిపించిండంట. టెలికాం కింగంట. 2జికి రాజంట. ఆయన నవ్విండంట. ఈయన ఏడ్చిండంట. ఏరు మన్మోహన్‌ అని ఎవరో పిలిచిన్రంట. మన్మోహన్‌ ఇంకా ఏడ్చిండంట. కేర్‌ మన్నడంట. ఉంగా ఉంగా అన్నడంట. జెపిసి వద్దే అని అంటున్నడంట. ఎక్కిళ్లుపట్టిండంట. మన్మోహన్‌... అని మళ్లీ గట్టిగా ఎవరో పిలిచింరంట. కోర్టు పాయే... బేడీలు పాయే... బోను పాయే... గీతల చొక్కా పాయే... రాజా గాయబాయే... మన్మోహన్‌... అని మళ్లీ పిలిచింరంట. తెల్లగా పాలిపోయిన మొహంతోని సోనియమ్మ కనిపించిందంట. మేడం జెపిసి వద్దు మేడం. కలనే భయంకరంగా ఉంది మేడం. ప్లీజ్‌ మేడం. జెపిసి వద్దు మేడం అని అంటున్నడంట. అప్పుడా మేడం మన్మోహన్‌జీ కలగంటున్నావ్‌. మనం ప్లీనరీలో ఉన్నాం. నువ్వు కునుకు తీసావంతే... చూడు చుట్టు మనోళ్లే ఉన్నారు అని అన్నదంట. మన్మోహన్‌ గట్టిగా ఊపిరి పీల్చుకుని 'కలనే ఇంత భయంకరంగా ఉంది. ఇదే నిజమైతే...?' అని ఆలోచించిండంట. వెంటనే మైకు దగ్గరకి ఉరికి 'ప్రధానిగా ఉన్న నన్ను ఎవ్వరు అనుమానించొద్దు. నేను సచ్చీలుణ్ని కావాలంటే కోరల్లేని  పిఎసి ముందు హాజరయితా, నిజాయితి నిరూపించుకుంటా. మళ్లీ చెబుతున్న జెపిసి మాత్రం వద్దు. జెపిసి మాత్రం వద్దు' అని చెప్పి మళ్లీ సోనియా మేడం దగ్గరబోయి కూసున్నడంట.

1 comment: