ఒబామా చేత ఎదిగిన (ఎమర్జ్డ్) దేశంగా పిలవబడ్డ భారత్ మునిగిన (సబ్మర్జ్డ్) దేశంగా పిలిపించుకునే రోజులు దగ్గర పడ్డాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తాజాగా విడుదలైన గణాంకాలు చెబుతోన్న వాస్తవాలు దీనినే సూచిస్తున్నాయి. దేశాల మధ్య వడ్డీచెల్లింపులు, సరుకులు, సేవలు, ఇతర వాణిజ్య లావాదేవీలను గణించే కరెంటు ఖాతాలో లోటు ఏకంగా 72శాతం పెరిగింది. ఎగుమతులు తగ్గిపోయి, దిగుమతులు పెరిగినప్పుడు ఇది సంభవిస్తుంటుంది. ప్రపంచ సంక్షోభం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో మన దేశం నుంచి ఎగుమతులు పెరిగాయి.
అది కూడా శాతాల్లో పెరుగుదల తప్ప పరిమాణంలో దిగుమతులతో పోటీ పడే స్థితిలో లేదు. 2009 ఏప్రిల్-నవంబర్ ఆరు నెలల కాలానికి, 6,960 కోట్ల డాలర్ల మేర ఉన్న వాణిజ్యలోటు, 2010లో ఇదే కాలానికి 8,160 కోట్ల బిలియన్ డాలర్లకు చేరింది. ఎగుమతులు భారీగా తగ్గడంతో ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా దేశీయ పారిశ్రామిక వేత్తలు తమ పరిశ్రమల ఆధునీకరణకు పూనుకున్నారు. ఇందుకోసం విదేశాల నుంచి యంత్రాలను విపరీతంగా దిగుమతి చేసుకుంటున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు విదేశీ మారకద్రవ్యాన్ని ఉపయోగించాల్సి వస్తోంది. మరోవైపు ఫ్యూచర్ట్రేడర్ల పుణ్యమా అని అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. దీంతో చమురు బిల్లుకూడా తడిసిమోపడవుతోంది. ఇవన్నీ కరెంటు ఖాతా లోటు ఒక్కసారిగా పెరిగేందుకు